Andhra Pradesh Weather Update: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. సోమవారం రోజున (మార్చి 23) రాష్ట్రంలో పలు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.