Andhra Pradesh Rains: ఏపీలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడటంతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.