Andhra Pradesh Rains: ఏపీవాసులకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వానలు పడనున్నాయి. ముఖ్యంగా కాకినాడ, పల్నాడు, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం మరికొన్ని గంటల్లో కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరికొన్ని జిల్లాలలో ఆరెంజ్ ఆలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు భారీవర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు.