ఆంధ్రప్రదేశ్లో 'స్త్రీ శక్తి' పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. మరో ఆరు నెలల్లో 1050 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. గోదావరి పుష్కరాలకు ఈ బస్సులను వినియోగించనున్నట్లు చెప్పింది. అంతేకాకుండా కొత్తగా కొనుగోలు చేయనున్న ఈవీ బస్సులకు.. డిపోల్లోనే చార్జింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది.