వైసీపీ హయాంలో విధుల నుంచి తొలగించిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ మళ్లీ విధుల్లోకి చేరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. డీజీపీ ఆర్డర్స్ తీసుకున్న ప్రకాష్.. అనంతపురం జిల్లా ఎస్పీని సోమవారం కలిశారు. అనంతరం ఏఆర్ కానిస్టేబుల్గా తిరిగి విధుల్లోకి చేరారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో పోలీసులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలంటూ ప్రకాష్ నిరాహార దీక్ష చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత వివిధ పరిణామాల మధ్య ఆయనను విధుల నుంచి తప్పించారు. తిరిగి మళ్లీ ఇప్పుడు విధుల్లోకి చేరారు.