పల్నాడు జిల్లాలో ఏఎస్ఐ వెంకట నాయుడు కుమారుడి గ్యాంగ్ కార్ల వ్యవహారంలో మరో కేసు నమోదైంది. ఫైనాన్స్ కంపెనీ కార్లను అప్పులు చెల్లించకుండా అమ్మేసి, నకిలీ నంబర్లు వేసి, ఛాసిస్ నంబర్లను మార్ఫింగ్ చేసిన కేసులో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో నకిలీ పోలీస్ అవతారమెత్తి ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతికి కారణమైన ఘటనలోనూ వెంకట నాయుడు కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది.