విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్ రన్కు సిద్ధమైంది. రేపు (జనవరి 4వ తేదీ) భోగాపురం ఎయిర్పోర్టులో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం భోగాపురం విమాశ్రయంలో ల్యాండ్ కానుంది. ఇందులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర అధికారులు ఎయిర్పోర్టులో దిగుతారు.మరోవైపు ఈ ఏడాది మే లేదా జూన్ నెల నుంచి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి పూర్తి స్థాయిలో విమానాల రాకపోకలు మొదలుకానున్నాయి.