తెలంగాణ రాజకీయాల్లో, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడిన విషయాలు వాస్తవమేనని ఆయన ధ్రువీకరించారు. పెద్ద ప్యాకేజీలక బీజేపీ పార్టీ వర్గాలు బీఆర్ఎస్ తో కలిసి పనిచేశాయని, దీనివల్ల బీజేపీ పలు ఎన్నికలలో నష్టపోయిందని.. రాష్ట్రంలో అధికారానికి రాలేకపోయిందని రాజాసింగ్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కవిత ఎపిసోడ్ చుట్టూ జరుగుతున్న చర్చకు కొత్త కోణాన్ని తీసుకొచ్చాయి. అంతర్గత విభేదాలను బహిర్గతం చేశాయి.