తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవ్ సూసైడ్ చేసుకున్నారు. ఎన్నికకు ఒక్కరోజు ముందు ఇవాళ ఉదయం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికార కాంగ్రెస్ పార్టీ వేధింపులతోనే ఘటన చోటు చేసుకుందన్న బీజేపీ శ్రేణులు డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించాయి. దీంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది.