సీసీఐ కొత్త నిబంధనతో పత్తి రైతులకు కొత్త కష్టాలు మెుదలయ్యాయి. ఇకపై పత్తి అమ్మకాలకు 'కపాస్ కిసాన్' యాప్లోనే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్మార్ట్ఫోన్ లేని, చదువు రాని వృద్ధ రైతులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. యాప్ వాడకం, వివరాల నమోదుకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. ఈ డిజిటల్ విధానంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.