ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు సోమవారం సాయంత్రం వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్లతో పాటు జలశక్తి శాఖ మంత్రిని చంద్రబాబు కలవనున్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మంగళవారం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు.