వానాకాలం సీజన్ పంట సాగు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను అప్డేట్ చేసింది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేసేందుకు ఇకపై మండల యూనిట్గా బుకింగ్స్ జరగనున్నాయి. ఏ మండల రైతు ఆ మండలంలోనే యూరియా కొనుగోలు చేయాలి. అలాగే పంట ఏదైనా ఎకరానికి గరిష్టంగా 2 బస్తాలకే పరిమితి విధించారు. ప్రతిసారీ ఓటీపీ అవసరం లేకుండా యాప్ను సరళీకరించారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు రైతులు యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకోవచ్చు.