Andhra Pradesh Cyclone Montha: ఆంధ్రప్రదేశ్ను వణికించిన 'మొంథా' తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య, నరసాపురం సమీపంలో భూభాగంపై తీవ్ర తుఫాన్గా కొనసాగుతోంది. రాష్ట్రంలో గాలుల తీవ్రత, రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అలాగే ఇవాళ కూడా కోస్తాంధ్ర, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటినా సరే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు. అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు ముఖ్యమంత్రి.