AP Government 3000 Cash to Montha Cyclone Affected Families : మొంథా తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పునారావాస కేంద్రాల్లో ఉండే వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉండే ఒక్కో కుటుంబానికి రూ.3000 నగదు, 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. తుపానుపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.