Andhra Pradesh Cyclone Montha Very Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. మచిలీపట్నం నుంచి కళింగపట్నం వరకు, ముఖ్యంగా కాకినాడ వద్ద తీవ్ర తుఫాన్గా తీరం దాటే అవకాశం ఉంది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, 2194 రిలీఫ్ క్యాంపులను సిద్ధం చేశారు. రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక వరదలు, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.