అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఓ ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించి, దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గన్మెన్ షేక్షావలిని అనంతపురం జిల్లా ఎస్పీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.