సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైలుకు శాశ్వత ప్రాతిపదికన మూడు అదనపు థర్డ్ ఏసీ బోగీలను జత చేయనున్నారు. ఈ మార్పుతో ప్రతి ప్రయాణంలో 200కు పైగా అదనపు బెర్తులు అందుబాటులోకి రానున్నాయి.