హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజల అభ్యంతరాలను పట్టించుకోలేదని, వార్డుల విభజన ఏకపక్షంగా జరిగిందని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే పాలన సులభతరం అవుతుందని భావించి ప్రభుత్వం వార్డుల విభజన చేసిన సంగతి తెలిసిందే.