జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి 27 మంది ఇంజినీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం పలు ఆరోపణలు, నివేదికలు, ఫిర్యాదుల ఆధారంగా తీసుకున్నారు. నగరంలో ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోకపోవడం.. తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో GHMC లో సక్రమమైన విధానాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.