స్నేహితులతో పందెం కట్టి ఓ బాలుడు పెన్ను మింగాడు. మూడేళ్ల కిందట అతడు 9వ తరగతిలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. కానీ, ఏడాది వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నుంచి కడుపు నొప్పితో బాధపడ్డాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా పలు ఆసుపత్రులు తిరిగాడు. చివరకు గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఎండోస్కోపీ ద్వారా ఎలాంటి కోత లేకుండానే పెన్నును విజయవంతంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఈ అరుదైన చికిత్స అందరినీ ఆశ్చర్యపరిచింది.