ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రవ్యాప్తంగా 51 మండలాల్లో రేపు తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మంగళవారం 53 మండలాలలో తీవ్రవడగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాయలసీమ జిల్లాలలో గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది.