పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో మూడు కొత్త రైల్వే టెర్మినల్స్ నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్ మధ్య ఈ టెర్మినల్స్ నిర్మాణం ద్వారా నగరంలో రైల్వే ఒత్తిడిని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. నాగులపల్లి, డబీర్పూర్, జుక్కల్ వద్ద ఈ టెర్మినల్స్ నిర్మించనున్నారు.