హైదరాబాద్ కోకాపేట నియోపొలిస్లో మిగిలిన 70 ఎకరాల భూమిని వేలం వేయడానికి హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో 29 ఎకరాల వేలం ద్వారా రూ. 3,862.8 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నిధులను నగర అభివృద్ధి కార్యక్రమాలకు, మెట్రో విస్తరణకు వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.