అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దక్షిణ మధ్య రైల్వే రూ.490 కోట్లతో 11 స్టేషన్ల పునరాభివృద్ధి పనులు వేగవంతం చేసింది. హైదరాబాద్లో 12 స్టేషన్లు అభివృద్ధి చేస్తుండగా.. హైటెక్సిటీ, మల్కాజిగిరి స్టేషన్లను ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ పనులు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయి.