తాను క్రికెట్ ఆడుకునే స్థలం కబ్జాకు గురికావడంతో ఓ బాలుడు హైడ్రా కమిషనర్కు లేఖ రాశాడు. స్పందించిన అధికారులు జూబ్లీహిల్స్ ప్రాంతంలో రూ.3900 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడారు. నార్నె ఎస్టేట్స్ అనే సంస్థ భూమిని ఆక్రమించి అమ్మడానికి ప్రయత్నించగా.. నిర్మాణాలు నిలిపివేశారు. బాలుడి చొరవతో వేల కోట్ల విలువైన భూమిని పరిరక్షించారు.