సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఐఫోన్, పందెం కోళ్లు, అవకాడో పండ్లు, వాహనాల అమ్మకం పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి, డబ్బులు దండుకుంటున్నారు. రూ.2 వేల ఐఫోన్ ఆశతో విద్యార్థి రూ.2.50 లక్షలు, కోడి కోసం రూ.1.54 లక్షలు, అవకాడో కోసం రూ.2 లక్షలు, వాహనం కోసం రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నారు.