హైదరాబాద్ నెహ్రూ జూ పార్కుకు వెళ్లేవారికి గుడ్న్యూస్. జూ సందర్శనకు వచ్చే వారికి ఇష్టమైన ఆహారం జూ లోపలే దొరకనుంది. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులో సందర్శకులకు అవసరమైన ఆహారం లభించనుంది.