హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియకు న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోయాయి. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300 వార్డులుగా మారుస్తూ ప్రభుత్వం త్వరలో తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రతి 45 వేల మంది జనాభాకు ఒక వార్డు ఉండేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజల నుంచి వచ్చిన సుమారు 5,905 అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం, ప్రజా సెంటిమెంట్ను గౌరవిస్తూ పాత పేర్లనే కొనసాగించాలని నిర్ణయించారు. ఈ పునర్విభజన వల్ల నగర పాలన ప్రజలకు మరింత చేరువకానుంది.