నేరెడ్మెట్ ఆర్కే పురం ఫ్లైఓవర్పై తల్లితో కలిసి పాఠశాలకు వెళ్తున్న ఆరేళ్ల బాలుడు స్కూటీ ప్రమాదంలో మృతి చెందాడు. భారీ ఆర్మీ వాహనం కింద పడిపోయిన బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సీపీ సజ్జనార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. భారీ వాహనాల వద్ద అప్రమత్తంగా ఉండాలని వాహనదారులకు సూచించారు.