హైదరాబాద్ శివారు ప్రాంతం కుత్బుల్లాపూర్లో నకిలీ మందుల దందా కలకలం రేపింది. మేడ్చల్ జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమ విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. కుత్బుల్లాపూర్లోని దుర్గా మెడికల్ అండ్ జనరల్ స్టోర్లో నాసిరకం మందులపై ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ లేబుల్స్, స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ షాపు యజమానిపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.