పోలీసు శాఖలో క్రమశిక్షణ తప్పిన ఘటన మల్కాజిగిరిలో కలకలం రేపుతోంది. ఒక కీలక డివిజన్లో ఏసీపీ, అడ్మిన్ ఎస్సై మధ్య వాగ్వాదం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సెలవులో ఉన్న SHO ఫైళ్లను అడిగిన ఏసీపీని, నిబంధనల ప్రకారం ఎస్సై సున్నితంగా తిరస్కరించడంతో ఈ వివాదం మొదలైంది. ఉన్నతాధికారుల వరకు చేరిన ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది.