Hyd: బంజారాహిల్స్‌లో 8.3 ఎకరాలు, కొండాపూర్‌లో 20 ఎకరాలు బహిరంగ వేలం.. ఏర్పాట్లు పూర్తి..

2 months ago 4
హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. బంజారాహిల్స్‌లోని 8.3 ఎకరాలు, కొండాపూర్‌లోని 20 ఎకరాల భూములకు ఈ నెలలోనే వేలం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో ఇప్పటికే ఈ భూములను ప్లాట్లుగా విభజించి వేలానికి సిద్ధం చేశారు. మరోవైపు కోకాపేటలో ఐటీ కంపెనీలకు గతంలో లీజుకు ఇచ్చిన 70 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. లీజు గడువు ముగియడంతో ఆ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ భూముల విక్రయం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
Read Entire Article