జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్ బీటెక్ విద్యార్థినులకు మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 40 మంది ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఆరు నెలల పాటు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి.. వార్షికంగా రూ. 4.5 లక్షల నుంచి రూ. 6 లక్షల వేతనంతో ఉద్యోగాలు అందించనున్నారు. ఈ శిక్షణ కోసం బెంగుళూరుకు చెందిన 'ఎమర్టెక్స్' సంస్థతో ఒప్పందం కుదిరింది.