హైదరాబాద్ మాదాపూర్లో రోడ్డు కుంగిపోవడంతో సైబరాబాద్ పోలీసులు కీలక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐకియా నుంచి జేఎన్టీయూ వెళ్లే మార్గంలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. భూగర్భ పైప్లైన్ లీకేజీ కారణంగా రోడ్డు కుంగిపోయిందని గుర్తించారు. ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని వాహనదారులకు సూచించారు. మరమ్మతులు పూర్తయ్యాయి.. త్వరలో రహదారి అందుబాటులోకి వస్తుందని చెప్పారు.