హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. విద్య, వైద్యం, రవాణా వంటి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ.. మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. హుస్సేన్సాగర్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, నగరంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.