హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాగల రెండు రోజులు కూడా ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అధిక ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ.. ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.