డిజిటల్ యుగంలో ప్రపంచం మొత్తం అరచేతుల్లోకి వచ్చేసింది. బ్యాంకు రుణాలు కూడా ఒక్క క్లిక్తో పొందుతున్నారు. దీంతో లోన్ యాప్ నిర్వాహకులు ఓ ఆయుర్వేద వైద్యుడ్ని నిండా ముంచేశారు. మార్ఫింగ్ చేసిన అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి రూ. 36 లక్షలకు పైగా ఓ ఆయుర్వేద వైద్యుడు వద్ద వసూలు చేశారు. దీంతో బాధితుడు సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.