మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాన్ కాలనీ ఫేజ్ -2లో బుధవారం తెల్లవారుజామున రౌడీ షీటర్ను కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేశారు. అలీనగర్కు చెందిన 25 ఏళ్ల సోహైల్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం తెల్లవారుజామున 2:40 గంటల సమయంలో సోహెల్ కడుపు, ఛాతి వెను భాగంలో కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య గురించి తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.