Hyderabad నడిరోడ్డుపై రౌడీషీటర్ హత్య.. మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం

1 hour ago 1
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాన్ కాలనీ ఫేజ్ -2లో బుధవారం తెల్లవారుజామున రౌడీ షీటర్‌ను కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేశారు. అలీనగర్‌కు చెందిన 25 ఏళ్ల సోహైల్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం తెల్లవారుజామున 2:40 గంటల సమయంలో సోహెల్ కడుపు, ఛాతి వెను భాగంలో కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య గురించి తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Entire Article