తెలంగాణలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. దీంతో భారీ ఆపరేషన్లు ఈగల్ టీఎం చేపట్టి.. డ్రగ్స్ ముఠాల ఆటకట్టిస్తోంది. తాజాగా హైదరాబాద్లో ముఖ్యంగా ఐటీ కారిడార్లో గంజాయి మాఫియాపై ఫోకస్ పెట్దింది. ఈ దందాకు కేరాఫ్ అడ్రస్గా మారిన లేడీ డాన్ నీతూ బాయి ఆటకట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆమె ఇంటి ముందు నిర్మాణం కూల్చివేసింది.