హైదరాబాద్ నగర ప్రజలకు అధికారులు భారీ ఊరట కలిగించే వార్త చెప్పారు. నగరంలో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. దీనిలో భాగంగా నగరంలో మరో 39 మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణానికి ఆమోదం తెలపడమే కాక.. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం నిధులు కూడా మంజూరు చేసింది. త్వరలోనే ఈ ఎస్టీపీల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దీనివల్ల నగరంలో మురుగు సమస్య పూర్తిగా తొలగిపోతుందని భావిస్తున్నారు. ఆ వివరాలు..