హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో కొత్త సమస్య ఎదురవుతోంది. ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం వంటి నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థుల్లో పలువురు ఇతర ప్రాంతాలకు చెందినవారిగా క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఖైరతాబాద్లో 480 ఇళ్లకు ఎంపికైన 600 మందిలో సుమారు 200 మంది మాత్రమే స్థానిక అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దరఖాస్తు ప్రక్రియలో నిబంధనలపై స్పష్టత లేకపోవడం గందరగోళానికి కారణమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.