ఐపీఎల్ సీజన్ 2025 నేటి నుంచి ప్రారంభమైంది. అయితే క్రికెట్ అభిమానుల కోసం ఈ సారి బీసీసీఐ ప్రత్యేకంగా ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తోంది. 23 రాష్ట్రాలలో 50 నగరాల్లో ఈ ఫ్యాన్ పార్కుల్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, వర్చువల్ జోన్లతో అభిమానులను ఉర్రూతలూగించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, కాకినాడ నగరాల్లో కూడా ఈ ఫ్యాన్ పార్కులు అందుబాటులో ఉంటాయి. ఎప్పుడు, ఏయే మ్యాచులకు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం