హైదరాబాద్లో ఐపీఎల్ ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. నగరంలో జరిగే మ్యాచ్లను వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియంకు వచ్చే ప్రేక్షకుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ప్రత్యేక రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది.