తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. జనగామ జిల్లా రద్దు వార్తలపై బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జనగామను రద్దు చేస్తే జిల్లా అగ్నిగుండంలా మారుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న జిల్లాను రద్దు చేస్తామంటే.. ప్రజలు చూస్తూ ఊరుకోరని పల్లా రాజేశ్వర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.