జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ముందుగానే అభ్యర్థిని ప్రకటించి, ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు వంటి 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. మాగంటి గోపినాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చి, గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటే పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని నేతలు భావిస్తున్నారు. రోడ్ షో లేదా భారీ సభతో ప్రచారం హోరెత్తే అవకాశం ఉంది.