Andhra Pradesh Rains: బంగాళాఖాతంలో వాయుగుండం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో జూరాల ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో గురువారం సాయంత్రం అధికారులు జూరాల ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే మే నెలలో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడం 18 ఏళ్లల్లో ఇదే తొలిసారని సమీప గ్రామాల ప్రజలు చెప్తున్నారు.