కడప స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్కు కారణమవుతోంది. ఈ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేఎస్డబ్ల్యూ యాజమాన్యానికి, సజ్జన్ జిందాల్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం పనులు రెండేళ్లు నిలిపివేసిందని.. ఇప్పటికైనా ప్రారంభమైనందుకు సంతోషంగా ఉందని జగన్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే జగన్ ట్వీట్కు సజ్జన్ జిందాల్ థ్యాంక్స్ చెప్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.