కాకినాడ జిల్లాలో మాటల కందని విషాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మధ్యాహ్న సమయం కావటంతో కొంతమంది కార్మికులు మధ్యాహ్న భోజనం కోసం బయటకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో వీరందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనాస్థలిలో రెండు గంటల పాటు పేలుళ్లు కొనసాగినట్లు తెలిసింది.