KCR Comments on Chandrababu over MoUs: ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంవోయూలకు హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు ఆద్యుడని విమర్శించారు. గతంలో విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు అంటూ హంగామా చేశారని.. ఎంవోయూలపై సంతకాలు చేసింది స్టార్ హోటల్స్లోని వంటమనుషులు, సప్లై చేసేవాళ్లంటూ కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి ఎంవోయూలతో ఏపీకి కనీసం రూ.10 వేలకోట్లు పెట్టుబడులు కూడా రాలేదని విమర్శించారు.