కృష్ణా నదీ ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై తెలంగాణ శాసనసభలో జరిగిన 'నీళ్లు-నిజాలు' చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు గైర్హాజరు కావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ప్రజల కంటే పార్టీకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.